( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - ఆనంద భైరవి )
నరవిందములకచ్చు లడఁగించు జిగి హెచ్చు
నాయతం బగు కన్నుదోయి తోడఁ
బులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు
దొరలంగనాడు కౌస్తుభముతోడఁ
లేము లుడిపెడు లేఁజూపు లేమతోడఁ
నల్లని మేఘములను కూడా బలహీనపరచగల నిగనిగలాడే చామనచాయ గల శరీరముతో, తామర రేకుల గర్వమును అణచివేయగల అందమైన కన్నులు కలిగి, గరుత్మంతుని రెక్కలయొక్క కాంతిని వన్నెపెట్టు (గీటురాయి మీద బంగారాన్ని వన్నె చూసినట్టు) బంగారు జరీ కలిపిన సన్నని పట్టువస్త్రములు ధరించి, బాలసూర్యబింబమును మించిన కాంతులు గలిగిన కౌస్తుభమణి ధరించిన స్వామి. ఒకచేతితో కమలము బట్టుకొని, మరొక చేతితో తన చేతిని పట్టుకున్న లక్ష్మీదేవి సరసనుండగా దయతో కూడిన చిరునవ్వుతో దర్శనమిచ్చాడు.
( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం -- సారంగ )
( ఈ పద్యం చదువరి స్వరంలో )
ఆ. తెలుగదేల యన్న, దేశంబు తెలు గేను
దెలుగు వల్లభుండ దెలుగొ కండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స
(ఈ పద్యం చదువరి స్వరంలో )
క. అంకితమో యన నీకల
వేంకటపతి యిష్టమైన వేల్పగుట దదీ
యాంకితము సేయు మొక్కొక
సంకేతమ కాకతడ రసన్నేగానే.
ఎవరికిచ్చినా ఒకటే కదా! తను ఆనతిచ్చినట్టుగా ఆ కావ్యాన్ని రచిస్తే, ఉత్తరోత్తర గొప్ప అభివృద్ధి పొందుతావని దీవించి ఆ తెలుగురాయలు అంతర్ధానమయ్యాడు. యుద్ధ సంరంభంలో ఉన్న రాయలకి ఇలాంటి కల రావడం విడ్డూరం కదూ!